ETV Bharat / bharat

Bharat Name Controversy : 'భారత్' నేమ్​బోర్డ్​తో జీ20కి మోదీ.. విపక్షాలు ఫైర్​.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 2:24 PM IST

india name change
india name change

Bharat Name Controversy : ఇండియాకు బదులుగా భారత్‌ అనే పేరును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చే చర్యను కేంద్రం తీసుకుంది. దిల్లీలోని జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న వేదికపై.. దేశం పేరును సూచించే స్థానంలో ఇండియాకు బదులుగా భారత్‌ నేమ్​బోర్డ్​ను ఉపయోగించింది.

Bharat Name Controversy : భారత్​ వర్సెస్​ ఇండియా చర్చ నడుస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. దిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్ నేమ్​ప్లేట్​తో కనిపించారు. జీ 20 సదస్సులో మోదీ కూర్చున్న వేదికపై దేశం పేరు భారత్‌ అని రాసి ఉంది. దీంతో అంతర్జాతీయ వేదికలపై కూడా ఇండియా బదులు భారత్‌ అనే పేరునే ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కేంద్రం పట్టుదలతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టమైంది.

ప్రతిపక్షాల మండిపాటు
Opposition On Inida Name Change In Telugu : మరోవైపు కేంద్రం తాజా చర్యపై విపక్షాలు మండిపడ్డాయి. మోదీ సర్కార్‌ ప్రజలను విడగొడుతోందని విరుచుకుపడ్డాయి. బీజేపీ నిరంకుశ ప్రభుత్వంగా మారిపోయిందని ఆరోపించారు మాజీ ఎంపీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు హన్నన్​ మొల్లా. ఇండియా పేరు మార్పుపై వివాదం నడుస్తున్న సమయంలోనే మోదీ భారత్​ నేమ్​ప్లేట్​ను ఉపయోగించడం.. ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలను గౌరవించకపోవడమేనని విమర్శించారు.

"అధికార బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ప్రపంచమంతా ఇండియా అంటేనే తెలుస్తోంది. ఇండియాను కూడా రాజ్యాంగంలో ప్రత్యేకంగా పొందుపరిచారు. వచ్చే ఎన్నికల్లో ఓటమిని తప్పించుకోవడానికి చేస్తున్న కుట్ర ఇది."

--అబ్దుల్ ఖలీగ్​, కాంగ్రెస్​ ఎంపీ

బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్​
Bjp On India Name Change in Telugu : విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన బీజేపీ.. ప్రతిపక్షాలు దేశంపై ఉన్న తమ వ్యతిరేకతను చూపిస్తున్నాయని మండిపడింది. ఇండియా అనే పేరు వలస కాలం నాటి ఆలోచనా విధానానికి నిదర్శనమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.

india name change
భారత్ నేమ్​బోర్డ్​తో మోదీ

విందు ఆహ్వానం, బుక్​లెట్లలో భారత్​ పేరు
ఇప్పటికే జీ20 సదస్సు కోసం పంపిన ఆహ్వానాలు సహా.. విదేశీ ప్రతినిధుల కోసం ఉద్దేశించిన G 20 బుక్‌లెట్‌లోనూ దేశం పేరును భారత్ అని పేర్కొన్నారు. భారత్, ప్రజాస్వామ్యానికి తల్లి అని బుక్‌లెట్‌లో రాసి ఉంది. అంతేకాకుండా దేశం అధికారిక పేరు భారత్ అనీ.. ఇది 1946-48 చర్చల్లోనూ రాజ్యాంగంలో ప్రస్తావించారని అని బుక్‌లెట్లో వివరించారు. జీ20 అధినేతలను విందుకు పిలిచేందుకు రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రికలోనూ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని పేర్కొన్నారు.

India Name Change Resolution : ఇండియా పేరు ఇక భారత్​గా మార్పు! త్వరలోనే కేంద్రం తీర్మానం!! విపక్షాల ఫైర్

Jaishankar On India Name Change : 'ఇండియా అంటేనే భారత్​.. అది రాజ్యాంగంలోనే ఉంది'.. విమర్శలపై జైశంకర్ కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.