ETV Bharat / bharat

ఆకాశంలో అత్యంత దగ్గరగా వచ్చిన విమానాలు.. అదృష్టవశాత్తూ...

author img

By

Published : Aug 24, 2021, 5:19 PM IST

AirAsia India, IndiGo flights
ఎయిర్​ ఏషియా

గుజరాత్​ నుంచి దక్షిణ భారత దేశానికి వచ్చే రెండు విమానాలు ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్​ హెచ్చరికలను పాటించకుండా, ప్రమాదకర రీతిలో ప్రయాణించాయని ఎయిర్​ క్రాఫ్ట్​ యాక్సిడెంట్​ బ్యూరో తెలిపింది. అంతేగాకుండా ఎయిర్​ ట్రాఫిన్​ను అంచనా వేయడంలో ముంబయి ఎయిర్​పోర్ట్​ కూడా విఫలమైనట్లు పేర్కొంది.

అహ్మదాబాద్-చెన్నై మధ్య తిరిగే ఎయిర్​ ఏషియా ఇండియా, బెంగళూరు-వడోదర మధ్య తిరిగే ఇండిగో విమానాలు జనవరి 29వ తేదీన ముంబయి గగనతలంలో 8 కిమీ దూరంలో ప్రయాణించినట్లు ఎయిర్​ క్రాఫ్ట్​ యాక్సిడెంట్​ బ్యూరో తెలిపింది. అంతేకాకుండా కేవలం 300 అడుగుల వర్టికల్​ సపరేషన్​లో ఎగిరినట్లు పేర్కొంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్​.. పరిస్థితులపై అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరిగిందని ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతేగాకుండా ముంబయి ఎయిర్​పోర్ట్​ కంట్రోలర్​ పరిస్థితిని ముందస్తుగా అంచనా వేయడంలో విఫలం అయినట్లు తెలిపింది.

ఇదీ జరిగింది..

సాధారణంగా అహ్మదాబాద్​ నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చే విమానాలు చాలా వరకు భావ్​నగర్​ మీదుగానే రావాల్సి ఉంటుంది. జనవరి 29న ఎయిర్​ ఏషియా విమానం ముంబయిలో ఎప్పటిలానే దిగాలనుకుంది. అయితే ఈ ప్లేన్​కు వ్యతిరేక దిశలో ఇండిగో విమానం వచ్చింది. ఇవి రెండు వివిధ ఎత్తుల్లో పరస్పరం సమాంతరంగా ప్రయాణించాయి. ఆ సమయంలో ఆ రెండు విమానాలు ఢీ కొట్టుకునే అవకాశం ఉందని గుర్తించిన ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్​.. ఇందుకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేసింది. అయితే దానికి ఇరువురు నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదని నివేదికలో పేర్కొంది.

ఇదీ చూడండి: Afghan News: అఫ్గాన్​ నుంచి భారత్​ చేరుకున్న మరో 78 మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.