ETV Bharat / bharat

Afghan News: అఫ్గాన్​ నుంచి భారత్​ చేరుకున్న మరో 78 మంది

author img

By

Published : Aug 24, 2021, 12:17 PM IST

Updated : Aug 24, 2021, 12:59 PM IST

అఫ్గాన్​ (Afghan news) నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం మరో 78 మంది దుశాంబే నుంచి భారత్​కు వచ్చారు. వీరిలో అఫ్గాన్ సిక్కులు, హిందువులు కూడా ఉన్నారు. సిక్కుల పవిత్ర గ్రంథం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్​ ప్రతులను కూడా వీరు భారత్​కు తీసుకొచ్చారు.

Evacuation from Afghanistan: India brings back 78 people
అఫ్గాన్​ నుంచి స్వదేశానికి మరో 78 మంది భారతీయులు

అఫ్గాన్​లో సంక్షోభం(Afghanistan crisis) నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తోంది కేంద్రం. మంగళవారం మరో 78 మందిని దిల్లీకి తీసుకొచ్చింది. వీరిలో 25మంది భారతీయులు కాగా.. 44 మంది అఫ్గాన్ సిక్కులు, మిగతావారు అఫ్గాన్​ హిందువులు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వీరందరిని సోమవారం కాబుల్​ నుంచి తజికిస్థాన్ రాజధాని దుశాంబేకు యుద్ధ విమానంలో తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక ఎయిర్​ ఇండియా విమానంలో మంగళవారం ఉదయం దిల్లీకి తీసుకొచ్చారు.

భారత్​కు వచ్చిన ఈ బృందంలోని వారు సిక్కుల పవిత్ర గ్రంథం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్​ మూడు ప్రతులను తీసుకొచ్చారు. దిల్లీలోని ఇంధిరా గాంధీ విమానాశ్రయంలో వీరికి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్వాగతం పలికారు. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ ప్రతులను కలిగి ఉండటం గర్వకారణమని ఆయన ట్వీట్ చేశారు. ఓ ప్రతిని ఆయన స్వయంగా మోసుకుంటూ తీసుకెళ్లారు. వీటిని దిల్లీలోని న్యూ మహవీర్ నగర్​లో ఉన్న గురు అర్జన్​ దేవ్​ జీ గురుద్వారాలో భద్రపరచనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

  • #WATCH | Union Minister Hardeep Singh Puri brings three swaroops of Sri Guru Granth Sahib out of the Delhi airport.

    The three Guru Granth Sahib have been brought on a flight from Kabul, Afghanistan.

    (Video Source: Union Minister Hardeep Singh Puri) pic.twitter.com/HrFVlRdael

    — ANI (@ANI) August 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అఫ్గాన్​లో ఇంకా 200 మంది సిక్కులు, హిందువులు ఉన్నారని, వీరంతా కాబుల్​లోని కార్తే పర్వాన్​ గురుద్వారాలో ఆశ్రయం పొందుతున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో 75 మందిని భారత్​కు తరలించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

సోమవారం నాటికి మొత్తం 730మందిని అఫ్గాన్​ నుంచి భారత్​కు తీసుకొచ్చింది కేంద్రం​.

ఇవీ చదవండి:

'ఆగస్టు 31 నాటికి మా వాళ్లను తరలిస్తాం'

Panjshir valley: తాలిబన్లకు పంజ్‌షేర్‌ నుంచి సింహగర్జన..!

Last Updated :Aug 24, 2021, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.