ETV Bharat / bharat

'మోదీ.. బట్టతల ఉన్న వ్యక్తులకు కూడా దువ్వెన అమ్మగలరు'.. ప్రధానిపై ఆప్​ ఎంపీ వ్యాఖ్యలు

author img

By

Published : Apr 30, 2023, 8:05 PM IST

aap-mp-sanjay-singh-said-pm-modi-has-the-skill-of-selling-comb-to-bald-people-too
ప్రధాని మోదీపై ఆమ్ ఎంపీ విమర్శలు

ఆమ్​ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్.. ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ బట్టతల ఉన్న వ్యక్తికి కూడా దువ్వెన అమ్మగల నైపుణ్యం ఆయన సొంతమని అన్నారు. ఆదివారం యూపీ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బట్టతల ఉన్న వ్యక్తికి కూడా దువ్వెన అమ్మగల నైపుణ్యాలు.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్నాయని ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ఎప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేస్తారని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్​పై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లడటం లేదని సంజయ్​ సింగ్ ప్రశ్నించారు. ఆదివారం ఉత్తర్​ప్రదేశ్​​ మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంజయ్ సింగ్​.. ఈ మేరకు ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఆమ్​ ఆద్మీ పార్టీ సంభాల్​ మున్సిపల్​ ఛైర్మన్​ పదవికి పోటీపడుతున్న ఫిజా షాజాద్ తరుఫున.. సంజయ్ సింగ్ ప్రచారం నిర్వహించారు.

మహిళ రెజర్లపై లైంగిక వేధింపులు జరిపిన రెజ్లింగ్​ ఫెడరేషన్ ఆఫ్​ ఇండియా ప్రెసిడెంట్..​ బ్రిజ్ భూషణ్ సింగ్​ విషయంలో మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని సంజయ్​ సింగ్​ నిలదీశారు. దీనిపై ప్రధాని మాట్లాడాలని ఆయన డిమాండ్​ చేశారు. ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వంపైనా సంజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్​ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హథ్రాస్ ఘటన, ఉమేశ్​ పాల్ హత్య, లఖీంపుర్​ ఖేరీ ఘటన వంటివి యూపీలోనే జరిగాయని సంజయ్​ సింగ్​ గుర్తు చేశారు. వీటిని యోగీ ప్రభుత్వం అదుపు చేయలేక పోయిందన్నారు. శాంతి భద్రతల విషయంలో యూపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని సంజయ్​ సింగ్​ ఆరోపించారు.

ప్రముఖ వ్యాపార వేత్త అదానీకి ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న సంబంధమేంటని సంజయ్​ సింగ్ ప్రశ్నించారు. మోదీ దేశం మొత్తాన్ని అదానీ చేతిలో పెట్టాడని ఆయన అన్నారు. ఆమ్​ ఆద్మీ పార్టీ పదే పదే బీజేపీని ఓడిస్తోందని.. అందుకే మిగతా పార్టీలు ఆప్​ అభ్యర్థికి గెలిపించాలని సంజయ్ సింగ్​ పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు అయిన చీపురు మనకెంతో ఉపయోగకరమని అభివర్ణించిన ఆయన.. శుభ్రత కోసం అందరు కలిసిరావలన్నారు.

మోదీ విష సర్పం టచ్​ చేస్తే మీ పని అంతే : ఖర్గే
భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ విష సర్పం లాంటి వారని ఖర్గే ఆరోపించారు. "ఆ పాముకు విషం ఉందో లేదోనని మీరు అనుకోవచ్చు. ఒకవేళ దానిని టచ్​ చేస్తే.. మీరు చనిపోతారు" అని ఖర్గే ఆరోపణలు గుప్పించారు. . ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. కర్ణాటక ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, బీజేపీ శ్రేణులు ఖర్గే వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ పార్టీతో పాటు ఖర్గే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలపై ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.