కొడుకు పుడితే నరబలి ఇస్తానని మొక్కులు.. 18 ఏళ్ల యువకుడి హత్య

author img

By

Published : Jul 15, 2022, 11:00 AM IST

After fulfilling to son murder of a youth

మధ్యప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కుమారుడు పుడితే నరబలి ఇస్తానని మొక్కుకున్నాడు ఓ వ్యక్తి. అతని కోరిక తీరడం వల్ల 18 ఏళ్ల యువకుడిని గొడ్డలితో నరికి బలి ఇచ్చాడు.

మధ్యప్రదేశ్​ రేవాలో దారుణం జరిగింది. మగబిడ్డ పుడితే నరబలి ఇస్తానని మొక్కుకున్నాడు ఓ వ్యక్తి. అతడి కోరిక తీరడం వల్ల దివ్యాంశ్(18) అనే యువకుడిని నరబలి ఇచ్చాడు. అనంతరం నిందితుడు రామ్​లాల్​ ప్రజాపతి పరారయ్యాడు. ఈ హత్య వారం రోజులు క్రితమే జరగగా.. తాజాగా పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

అసలేం జరిగిందంటే: బైకుంత్​పుర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని బెధువా గ్రామంలో పుల్మతి దేవి ఆలయం ఉంది. ఆ దేవాలయంలో మొండెం లేని యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పక్కనే గొడ్డలి కూడా ఉంది. మృతుడు.. క్యోంటి గ్రామానికి చెందిన దివ్యాంశ్​గా ​(18) గుర్తించారు. హత్యకు ముందు దివ్యాంశ్ అదే గ్రామానికి చెందిన రామ్​లాల్​ అనే వ్యక్తితో కనిపించినట్లు పోలీసు విచారణలో తేలింది. దీంతో రామ్​లాల్​ను పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.

నిందితుడు రామ్​లాల్​ను అరెస్టు చేశాం. అతడికి ముగ్గురు కుమార్తెలు. కొడుకు పుడితే నరబలి ఇస్తానని దేవాలయంలో ప్రమాణం చేశాడు. అతడికి కుమారుడు జన్మించడం వల్ల దివ్యాంశ్ అనే యువకుడిని గుడికి తీసుకెళ్లి గొడ్డలితో నరికి నరబలి ఇచ్చాడు.

-పోలీసులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.