ETV Bharat / bharat

చాక్లెట్ ఆశచూపి బాలికపై అత్యాచారం.. ఆపై కిరాతకంగా..

author img

By

Published : Jan 17, 2022, 7:03 AM IST

girl rape
బాలికపై అత్యాచారం

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడమే కాక.. ఆ బాలికను హత్యచేశాడు ఓ కిరాతకుడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

మధ్యప్రదేశ్​లో విషాదకరమైన ఘటన జరిగింది. చాక్లెట్ ఆశచూపి.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేయడమే కాక.. కిరాతకంగా చంపాడు ఓ దుండగుడు. శివపురి జిల్లా తెందువా పోలీస్​స్టేషన్ పరిధిలోని ఇమాలియా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

చాక్లెట్ ఆశచూపి..

ఇమాలియా గ్రామానికి చెందిన ఉత్తమ్ నారాయణ్(35).. పక్కింట్లో ఒంటరిగా ఉన్న బాలికను చాక్లెట్ ఇస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని స్థానికంగా ఉన్న గోధుమ కంటైనర్​లో పడేశాడు.

కొద్దిసేపటి తర్వాత.. బాలిక తల్లిదండ్రులు ఇంటివద్దకు వచ్చి చిన్నారిని వెతికారు. ఆచూకీ దొరక్కపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. గోధుమ కంటైనర్​లో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తమ్ నారాయణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

ఇదీ చూడండి: రిసార్టులో ఎలుగుబంటి హల్​చల్​.. అర్ధరాత్రి సంచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.