ETV Bharat / bharat

కూలిన భవనం పైకప్పు- ఇద్దరు మృతి

author img

By

Published : Aug 24, 2021, 1:49 AM IST

పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఇంటిపైకప్పు కూలి ఇద్దరు మృతిచెందారు. 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

house collapse
కూలిన భవనం

ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని ఓ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఇంటిపైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి తీవ్రంగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.

agra, house collapse
కూలిన ఇంటిపైకప్పు

తాజ్​గంజ్​లోని ధంధాపుర ప్రాంతంలో 8.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అధికారి ప్రభు సింగ్ తెలిపారు. గాయాలపాలైనవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

agra, house collapse
సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
agra, house collapse
పలువురికి తీవ్రంగా గాయాలు

ఇదీ చదవండి:పుట్టినరోజు వేడుకల్లో పేలిన తుపాకీ.. చివరికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.