గతుకుల రోడ్డు ప్రయాణం ఆపై ఫిట్​నెస్ అంతంతే - పంటకాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడ్డ బస్సు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 5:34 PM IST

Updated : Dec 17, 2023, 10:07 PM IST

thumbnail

RTC Bus Rammed Into Crop Canal: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెెళ్తే జిల్లాలోని చల్లపల్లి మండలం మేకావారిపాలెం వద్ద అవనిగడ్డ నుంచి విజయవాడకు బయలు దేరిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటీ ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి రహదారిపై ఏర్పడ్డ గుంతలు, బస్సు మరమ్మత్తులకు నోచుకోవడమే కారణమని ప్రయాణికులు వాపోతున్నారు. 

విషయం తెలుసుకున్న చల్లపల్లి సీఐ నాగ ప్రసాద్, ఎస్​ఐ చినబాబులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బస్సు స్థితిగతులపై ప్రతి రెండు నెలలకొకసారి పరీక్షిస్తున్నామంటూ డిపో మేనేజరర్‌ సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చల్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. 

Last Updated : Dec 17, 2023, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.