విద్యార్థులకు కఠిన పరీక్ష - నిత్యం సాహసోపేత ప్రయాణంతో పొంచిన ప్రమాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 2:54 PM IST

thumbnail

Difficulties for Students to Cross the Road : ఆ ఊరి విద్యార్థులు పాఠశాలకు వెళ్లాంటే నదులు, వాగులు దాటాల్సిన అవసరం లేదు. కానీ, రోడ్డుపైన ఆ పరిస్థితి నెలకొంది. వైఎస్సార్​ జిల్లా కమలాపురం మండలం యర్రగుడిపాడులో ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సమీపంలో రైల్వే అండర్​పాస్ ఉంది. వంతెన కింద మోకాలి లోతు వరకు ఊట నీరు చేరుకుంది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే ఆ అండర్​పాస్​ దాటి వెళ్లాలి. నీళ్లు ఎక్కువగా ఉండడంతో వాహనదారులు, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.

వంతెన కింద మోకాలి లోతు వరకు నీరు నిల్వ ఉన్నా రైల్వే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. కనీసం మోటర్లు సహాయంతో నీటిని తొలగించే ప్రయత్నం కూడా చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో మరింత లోతులో నీరు ఉంటుందని తెలిపారు. తమ పిల్లలకు ఎక్కడ, ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతూ ఉంటామని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.