Ap Connect Expo Programme In Vizag: ఆధునిక సాంకేతికతపై అవగాహన కోసమే.. విశాఖలో ఏపీ కనెక్ట్​ ఎక్స్​పో

By

Published : Jul 31, 2023, 1:38 PM IST

thumbnail

AP Connect Expo program Is Over In Vizag: కేబుల్​ టీవీ, ఓటీటీ రంగంలో వచ్చిన సాంకేతిక మార్పులను పరిచయం చేసేందుకు విశాఖపట్టణంలోని గాదిరాజు ప్యాలెస్​లో ఏపీ కనెక్ట్ పేరిట ఏర్పాటు చేసిన ఎక్స్​పో కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఇతర ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకునేందుకు రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎక్స్​పో కార్యక్రమం ఎంతో ఉపకరించిందని సందర్శకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఈటీవీ విన్​ స్టాల్​కు విశేష స్పందన వచ్చింది.  ఈ ప్రదర్శనలో భాగంగా విన్​తో వినోదం పేరిట ఈటీవీ విన్ యాప్​ ఆందిస్తున్న  ప్రత్యేక రాయితీలను నగరవాసులు పెద్దసంఖ్యలో సద్వినియోగం చేసుకున్నారు. ఈటీవీ విన్‌ యాప్‌ గోల్డెన్‌ స్పాన్సర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో.. 70కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక 4కే సాంకేతికతను అందుకునేందుకు ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను సామాన్య ప్రజలకు తెలియజేయడంలో ఈ ఎక్స్​పో కార్యక్రమాలు ఎంతో దోహద పడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి  కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలనుకునే వారి సంకల్పానికి ఈ ఎక్స్​పో నిర్వహణ తమకు ఎంతో దోహదపడిందని నిర్వహకులు అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.