మోదీ ముసుగుతో రోడ్డుపై వినూత్న నిరసన చేసిన విశ్రాంత సైనికుడు

By

Published : Nov 7, 2022, 11:51 AM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మాజీ సైనికుడు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఖేక్​డాకు చెందిన విశ్రాంత సైనికుడు సుభాష్ చంద్​ కశ్యప్​ అనే వ్యక్తి తన నిరసనను జాతీయ రహదారిపై వింతగా తెలియజేశారు. ఓ చేతిలో లాంతర్, మోదీ ముసుగు పట్టుకుని ఖేక్​డా నుంచి గజియాబాద్​ వరకు దాదాపు 30 కిలోమీటర్లు కాలి నడకన గుంతలు లేని రోడ్డు వెతుక్కుంటూ వెళ్లారు. దిల్లీ సహాన్​పుర్​ జాతీయ రహదారికి గత కొన్ని రోజులుగా పనులు జరుగుతున్నాయి. దీని వల్ల రోడ్డుపై మొత్తం గుంతలు ఏర్పడ్డాయి. ఆ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఆయన గతంలో లోక్​సభ ఎన్నికల్లోనూ పోటీచేశారు. అయితే బాగ్​పథ్ రోడ్ల విషయంలో మోదీ చెప్పిన మాటలు ఇక్కడ జరగడం లేదని సుభాష్ ఆరోపించారు.

Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.