ETV Bharat / state

భీమునిపట్నం రహదారి వద్ద వలస కూలీలకు ఆహార పంపిణి

author img

By

Published : May 19, 2020, 11:49 AM IST

Food distribution for migrant laborers at Bhimunipatnam road
భీమునిపట్నం రహదారి వద్ద వలస కూలీలకు ఆహార పంపిణి

విశాఖ నుంచి వారి స్వస్థలాలకు చేరుకుంటున్న వలస కూలీలకు దారి పొడవునా ఆహారం పంపిణీ చేసేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. భీమునిపట్నానికి చెెందిన దివీస్ లేబొరేటరీస్ ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వలస కూలీలకు ఆహారం అందించారు.

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడ దివీస్ లేబొరేటరీస్ ఉద్యోగులు స్వచ్చందంగా వలస కూలీలకు అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు.

తగరపువలస జాతీయ రహదారి సంగివలస వద్ద కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు, వివిధ వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్తున్న వారికి... అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాలను అందజేశారు.

ఇదీ చదవండి:

కరోనా పంజా: దేశంలో లక్ష దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.