ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM

author img

By

Published : Nov 14, 2022, 6:59 PM IST

AP TOP NEWS
AP TOP NEWS

.

  • రాష్ట్ర విభజన కేసులు, అమరావతి రాజధాని కేసుల విచారణ విడివిడిగానే
    అమరావతి రాజధాని, రాష్ట్ర విభజన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే రెండు కేసులను విడివిడిగా విచారణ జరపాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరగా.. అందుకు అత్యున్నత ధర్మాసనం అంగీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పన్ను అక్రమాలకు పాల్పడుతున్న వారిపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్
    ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మద్యం, మైనింగ్, గంజాయితో పాటు పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ముఖ్యంగా పన్ను అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కేసు నమోదైన 90 రోజుల తర్వాత.. డీఫాల్ట్​ బెయిల్​కు అవకాశం.. కానీ: హైకోర్టు
    వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్​ పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. క్రిమినల్​ కేసు నమోదైన 90 రోజుల తర్వాత డీఫాల్ట్‌ బెయిల్‌కు అవకాశం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తల్లిదండ్రులు ఆలోచిద్దాం అన్నారు.. కానీ ఆ బాలుడు
    ఒక్కసారి ప్రేమిస్తే చాలు.. ప్రాణాలిచ్చేందుకు కూడా వెనకాడరు. తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటే.. తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడం చూస్తున్నాం. కొందరు తమ ప్రేమను ఇంట్లో చెబితే ఒప్పుకుంటారో లేదోనని ముందే భయపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మైనర్ తన ప్రేమను ఇంట్లో చెప్పగా.. వారు కాస్త ఆగి ఆలోచిద్దాం అనడంతో.. మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'అనుమతుల ప్రకారమే రుషికొండలో తవ్వకాలు చేపట్టాలి'
    రుషికొండ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్​ కొనసాగుతూనే ఉంది. వైకాపా నేతలు తప్పు చేయనప్పుడు.. పవన్​కల్యాణ్​ రుషికొండలో పర్యటిస్తే భయమెందుకని జనసేన నేతలు ప్రశ్నిచారు. నగర పాలక సంస్థ నుంచి తెచ్చిన అనుమతి ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్లు తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అడవిలో ప్రాణాపాయంలో యజమాని.. కాపాడిన శునకం.. ఎలాగంటే..
    కర్ణాటకలో ఓ శునకం తన యజమాని ప్రాణాలను కాపాడి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఆ కుక్క చేసిన పనిని చూసి ఆ గ్రామస్థులంతా ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆ శునకం ఏం చేసిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్యాన్సర్​పై 'ఐరన్​మ్యాన్' IPS విజయం.. స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్​లోనూ..
    గొప్ప పట్టుదలతో క్యాన్సర్​ను ఓడించారు ఓ ఐపీఎస్ అధికారి. అనంతరం ఫిట్​నెస్​లో తాను 'ఐరన్​మ్యాన్' అని నిరూపించుకున్నారు. అత్యంత కఠినమైన ట్రయాథ్లాన్ రేసును పూర్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జో బైడెన్​, జిన్​పింగ్ భేటీ.. ఆ అంశాలపై ప్రతిష్టంభన వీడేనా?
    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధినేత జిన్​పింగ్​ ఇండోనేషియాలో సమావేశమయ్యారు. అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • KKRకు గట్టి షాక్​ ఇచ్చిన సామ్​.. సీజన్​ మొత్తానికి దూరంగా ఉండాలని..
    ఐపీఎల్‌ 2023 మినీ వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు బ్యాటర్‌ సామ్‌ బిల్లింగ్స్‌.. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గ్రీన్​ సారీలో ఊర్వశి అందాలు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
    బాలీవుడ్​ అందాల తార ఊర్వశీ రౌతేలా సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో సినిమాల్లో అడుగుపెట్టింది. చేసింది కొన్ని సినిమాలే అయినా బాలీవుడ్​లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. మిస్​ యూనివర్స్ ఇండియా, మిస్​ దివా, మిస్​ యూనివర్స్ వంటి కిరీటాలను గెలుచుకుంది ఊర్వశి. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ.. ఫాలోవర్స్​ను పెంచుకుంటోంది ఈ భామ. తాజాగా గ్రీన్​ సారీలో దిగిన కొత్త ఫొటోలను షేర్​ చేసింది. హాట్​ అందంతో అభిమానులను కట్టి పడేస్తున్న ఈ అమ్మడు చిత్రాలపై మీరూ ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.