ETV Bharat / state

'అనుమతుల ప్రకారమే రుషికొండలో తవ్వకాలు చేపట్టాలి'

author img

By

Published : Nov 14, 2022, 4:44 PM IST

Janasena corporator: రుషికొండ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్​ కొనసాగుతూనే ఉంది. వైకాపా నేతలు తప్పు చేయనప్పుడు.. పవన్​కల్యాణ్​ రుషికొండలో పర్యటిస్తే భయమెందుకని జనసేన నేతలు ప్రశ్నిచారు. నగర పాలక సంస్థ నుంచి తెచ్చిన అనుమతి ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్లు తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు.

Janasena
జనసేన

Janasena corporator: రుషికొండను పవన్ కల్యాణ్ సందర్శిస్తే ఉలికిపాటు ఎందుకని జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ వైకాపా నేతలను ప్రశ్నించారు. రుషికొండ నిర్మాణాల్లో పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. అవాస్తవమైతే మహానగర పాలక సంస్థ నుంచి అనుమతి తెచ్చిన ప్లాన్​ను బయటపెట్టేందుకు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని నిలదీశారు.

జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్

"తీసుకున్న అనుమతుల ప్రకారమే తవ్వకాలు జరపాలి. జీవీఎంసీ ఇచ్చిన ప్లాన్​ను ఎందుకు ప్రదర్శించడం లేదు. తెదేపా నాయకులు వెళ్తే అరెస్టులు చేస్తారు. ప్రభుత్వ ఆస్తులతో, ప్రజల ధనంతో కడుతున్న ప్రభుత్వ భవనాలను ఎందుకు చూడనివ్వటం లేదు." -మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.