ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

author img

By

Published : Oct 28, 2022, 6:59 PM IST

7PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

.

  • అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
    High Court reserved judgment: అమరావతి రైతుల మహా పాదయాత్రపై ప్రభుత్వం, రైతులు వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • APSRTC: ఏపీఎస్​ఆర్టీసీకి స్కోచ్ అవార్డు
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంస్థలో నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ ప్రవేశపెట్టినందుకు.. జాతీయ స్థాయి అవార్డు సాధించింది. 2022 ఏడాదికి గాను స్కోచ్ అవార్డును గెలుచుకుంది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలతో పోటీ పడి ఈ అవార్డులను సాధించింది. వర్చువల్ సెమినార్ ద్వారా అవార్డును ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి అందుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రుషికొండ బయలుదేరిన తెదేపా నేతలు అరెస్టు
    విశాఖ జిల్లా రుషికొండ బయలుదేరిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. నేతలను అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించారు. ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ రామారావు, పల్లా శ్రీనివాస్‌, ఇతర నేతలు అరెస్ట్​ అయ్యారు. తెదేపా నేతలను పార్టీ కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నేతలు, పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తాడేపల్లిగూడెం నిట్​లో విద్యార్థుల ఆందోళన.. బయో ఫ్యాకల్టీపై చర్యలకు డిమాండ్​
    Students agitation in NIT: తాడేపల్లిగూడెం నిట్​లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిట్​లోని ఓ ఫ్యాకల్టీ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వేధింపులకు పాల్పడ్డవారు బహిరంగ క్షమాపణలు చెప్పి, వెంటనే విధుల నుండి తప్పుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఉచితాలను నియంత్రించే అధికారం ఈసీకు లేదు'.. ఎన్నికల్లో వాగ్దానాలపై కాంగ్రెస్
    ప్రస్తుతం దేశంలోని అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలవాలంటే ఉచితాలు ఎరగా వేస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయ పడి.. ఎన్నికల వాగ్దానాలకు అయ్యే వాస్తవ ఖర్చు ఓటర్లకు వెల్లడించాలని లేఖ రాసింది. దీనిపై భాజపా స్పందించగా.. తాజాగా కాంగ్రెస్​ పార్టీకూడా స్పందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లారీ, కారు ఢీ.. ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఐదుగురు మృతి
    జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఓ లారీ, కారు ఢీకొని ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృతిచెందారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధరించారు. మరో ఘటనలో ఓ కారు అదుపుతప్పి 70 అడుగుల లోతున్న బావిలో పడి.. మామ, మేనల్లుడు అక్కడికక్కడే మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మోదీ గొప్ప దేశభక్తుడు.. వారి విదేశాంగ విధానం భేష్'.. పుతిన్​ ప్రశంసలు
    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆయనను దేశభక్తునిగా అభివర్ణించారు. స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబిస్తున్నారని కొనియాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మస్క్​ చేతికి ట్విట్టర్​.. భారత ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు
    ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. యజమానులతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమ సంస్థలు అనుసరించాల్సిన నిబంధనలు, చట్టాలు అలాగే కొనసాగుతాయని ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • T20 Worldcup: వరుణుడి ఖాతాలో 'నాలుగు'​.. సెమీస్‌ అవకాశాలపై ప్రభావమెంత?
    ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్​లో ట్రోఫీని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అగ్రశ్రేణి జట్లకు వరుణుడు ఊహించని షాకులు ఇస్తున్నాడు. ఈ మెగాటోర్నీలో వర్షం వల్ల రద్దవుతున్న మ్యాచ్​ల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ప్రాక్టీస్​ మ్యాచ్​ల నుంచే తన ప్రతాపాన్ని చూపి అభిమానుల గుండెల్లో గుబులు రేపాడు. కీలకమైన సూపర్‌ -12 దశలో ఇప్పటికే 'నాలుగు' మ్యాచుల్లో తన ప్రతాపంతో విజయం సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నటి నిత్యామేనన్ ప్రెగ్నెంట్​ పోస్ట్​.. గందరగోళంలో ఫ్యాన్స్​
    ప్రముఖ నటి నిత్యా మేనన్​ ప్రెగ్నేన్సీ టెస్ట్ కిట్​ ఫోటోతో పెట్టిన పోస్ట్ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ పోస్ట్​తో ఆమె ఫాలోవర్స్, నెటిజన్స్‌ను కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.