ETV Bharat / state

Death: నీటి కాలువలో పడి రెండేళ్ల బాలుడి మృతి

author img

By

Published : Oct 30, 2021, 10:32 AM IST

two years old boy dead falling in water pit at nandyal at kurnool
నీటి కాలువలో పడి బాలుడి మృతి

అప్పటివరకు కళ్లముందే ఆడుకుంటున్న ఆ బాలుడు ఒక్కసారిగా కనబడకపోయేసరిగా తల్లిదండ్రులు ఖంగుతిన్నారు. బాలుడి కోసం వెతకటం ప్రారంభించగా.. ఇంటి సమీపంలోని కాలువలో మృతి చెంది ఉన్న ఘటన.. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. రెండేళ్ల ఇస్మాయిల్ ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు తమ ఇంటి సమీపంలోని కాలువలో పడి మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


కర్నూలు జిల్లా నంద్యాలలో నీటి కాలువలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన స్థానికులను కలచివేసింది. నంద్యాల పట్టణంలో మహమ్మద్‌ ఇస్మాయిల్‌(2) అనే రెండేళ్ల బాలుడు శుక్రవారం నీటి కాల్వలో పడి మృతి చెందారు. నంద్యాల మండలం కానాలకు చెందిన మౌలాలి, భాను దంపతులు విజయ డెయిరీ సమీపంలో నివాసముంటున్నారు. శుక్రవారం తల్లి భాను ఇంటిపైకి వెళ్లి దుస్తులు ఆరబెడుతున్నారు. ఈ సమయంలో రెండేళ్ల కుమారుడు ఇస్మాయిల్‌ ఇంటి ముందు ఆడుకుంటూ పక్కనే ఉన్నకాలువలో పడిపోయాడు. ఇంట్లో బాలుడు కనిపించకపోవడంతో బయటికి వచ్చి చూడగా బాబు కాల్వలో పడినట్లు గుర్తించారు. వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. తాలూకా సీఐ మురళీమోహనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

Video Call: తనను తీసుకెళ్లడం లేదని... భర్తకు వీడియో కాల్‌ చేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.