ETV Bharat / city

Video Call: తనను తీసుకెళ్లడం లేదని... భర్తకు వీడియో కాల్‌ చేసి..

author img

By

Published : Oct 30, 2021, 7:30 AM IST

కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన భర్తకు వీడియోకాల్‌ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.

Video Call Suicide
భర్తకు వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన భర్తకు వీడియోకాల్‌ చేసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా బాబేనాయక్‌ తండాకు చెందిన రమ్యశ్రీకి(22) కర్ణాటక రాష్ట్రం చేలూరుకు చెందిన చందునాయక్‌తో వివాహమైంది. వీరికి 11 నెలల కుమార్తె ఉంది. కుటుంబ విషయమై కొన్ని రోజులుగా భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో మదనపల్లెలోని ఎస్‌బీఐ కాలనీ విస్తరణ ప్రాంతంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు రమ్యశ్రీ వచ్చింది. తనను తీసుకెళ్లడం లేదని శుక్రవారం భర్తకు వాట్సప్‌ ద్వారా వీడియో కాల్‌ చేసి అతను చూస్తుండగానే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆయన ఈ విషయాన్ని రమ్యశ్రీ తల్లి కమలమ్మకు ఫోన్‌ చేసి చెప్పాడు.

అల్లుడి వేధింపుల కారణంగానే కుమార్తె ఉరి వేసుకుందని కమలమ్మ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి : రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.