ETV Bharat / state

BANNERS: అంకాలమ్మ జాతరలో తెదేపా, వైకాపా బ్యానర్లు.. చించేసిన గుర్తుతెలియని వ్యక్తులు

author img

By

Published : May 15, 2022, 12:36 PM IST

BANNERS
తెదేపా, వైకాపా బ్యానర్లను చించిన గుర్తుతెలియని వ్యక్తులు

BANNERS: అంకాలమ్మ తల్లి జాతర సందర్భంగా ఊరి ముఖద్వారం వద్ద తెదేపా, వైకాపా తరఫున బ్యానర్లు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పోటాపోటీగా శుభాకాంక్షలు చెబుతూ కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు.

BANNERS: కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్.ఎన్ గొల్లపాలెంలో వైకాపా, తెలుగుదేశం బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఇవాళ అంకాలమ్మ తల్లి జాతర సందర్భంగా ఊరి ముఖద్వారం వద్ద రెండు పార్టీల తరఫున బ్యానర్లు ఏర్పాటు చేశారు. మూడేళ్లకోసారి జరిగే జాతర సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పోటాపోటీగా శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు కట్టారు. రాత్రివేళ బ్యానర్లు చించివేయడం గ్రామంలో కలకలం రేపింది.

ఇవీ చదవండి: తెనాలిలో దారుణం.. మూగ యువతిపై అత్యాచారం


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.