ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకులు ఎం.డి హిదాయత్ను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ ద్వారా పరామర్శించారు. ఇటీవల కొవిడ్ బారిన పడిన హిదాయత్.. ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లతో మాట్లాడి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గుండె నిబ్బరంతో కరోనాను జయించాలని, ఏ అవసరమొచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని చంద్రబాబు హిదాయత్కు భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: