ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

author img

By

Published : Jun 5, 2020, 10:27 AM IST

Farmer suicide with Financial problems in saathulooru gunturu district
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ రైతు వేపచెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా సాతులూరులో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన రైతు పాటిబండ్ల ఆంజనేయులు.. తనకున్న ఎకరంన్నర పొలంతో పాటు మరో 17.5 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగు చేశాడు. పంటలు దెబ్బతినడం, గిట్టుబాటు ధర రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలన్న మానసిక వేదనతో తన పొలంలోని వేప చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

'సీఎం ప్రతీకార ధోరణి వీడి.. ప్రగతి వైపు నడవాలి':శైలజానాథ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.