ETV Bharat / state

మిర్చి రైతుల సమస్యలపై.. వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టాలి: చంద్రబాబు

author img

By

Published : Jan 11, 2023, 3:27 PM IST

Chandrababu on Mirchi Farmers
చంద్రబాబు

Chandrababu on Mirchi Farmers Problems: మిర్చి రైతుల కష్టాలపై వ్యవసాయ శాఖ స్పందించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. నల్ల తామర పురుగుతో మిర్చి రైతులు వరుసగా రెండో ఏడాది కూడా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పంటను కాపాడుకునేందుకు రకరకాల మందుల వాడకంతో పెట్టుబడి రెట్టింపు అవుతుందని తెలిపారు. పురుగుమందుల ధరల నియంత్రణపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలని కోరారు.

Mirchi Farmers Problems in AP: రాష్ట్రంలోని మిర్చి రైతుల కష్టాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మిర్చి రైతుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.

మిర్చి రైతుల కష్టాలపై వ్యవసాయ శాఖ స్పందించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. నల్ల తామర పురుగుతో మిర్చి రైతులు వరుసగా రెండో ఏడాది కూడా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పంటను కాపాడుకునేందుకు రకరకాల మందుల వాడకంతో పెట్టుబడి రెట్టింపు అవుతుందని వివరించారు. పురుగుమందుల ధరల నియంత్రణపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలని కోరారు. తామర పురుగు నివారణపై రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

  • నల్ల తామర పురుగుతో మిర్చి రైతులు వరుసగా రెండో ఏడాది కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. పంటను కాపాడుకునేందుకు రకరకాల మందుల వాడకంతో పెట్టుబడి రెట్టింపు అవుతుంది. పురుగుమందుల ధరల నియంత్రణ పై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలి. తామర పురుగు నివారణకు రైతులకు తగు సూచనలు ఇవ్వాలి. pic.twitter.com/u9zRCR0JTF

    — N Chandrababu Naidu (@ncbn) January 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.