ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే జీవో నెం 1: టీడీపీ నేత బొండా ఉమ

author img

By

Published : Jan 11, 2023, 1:23 PM IST

Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao: అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్​ మీద టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పోలీసులు.. వైసీపీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. నారా లోకేశ్​ పాదయాత్రకు అనుమతి కోసం డీజీపీ ఆఫీసుకి లేఖ పంపితే.. ఇంతవరకు సమాధానం లేదని తెలిపారు.

Bonda Umamaheswara Rao: జీవో నెంబర్ 1పై అడిషనల్ డీజీపీ రవిశంకర్.. తాడేపల్లి స్క్రిప్టు చదివారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తాడేపల్లి ఆదేశాలతో పలమనేరు డీఎస్పీ.. చంద్రబాబుని ఆపి కుప్పంలో ఇబ్బందులు పెట్టలేదా అంటూ ప్రశ్నించారు. జీవో 1 అనేది ప్రతిపక్షాల గొంతు నొక్కడానికేనని విమర్శించారు. వైసీపీకి కొంత మంది పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. నారా లోకేశ్​ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే డీజీపీ ఆఫీసుకి లేఖ పంపామని తెలిపారు. పోలీసులు చెప్పిన విధంగానే అనుమతి కోరుతూ లేఖ పెట్టినా ఇంతవరకు సమాధానం రాలేదని బొండా ఆక్షేపించారు.

వైసీపీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారు: టీడీపీ నేత బోండా ఉమ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.