ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : Dec 18, 2022, 8:57 PM IST

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

.

  • భాజపా, తెలుగుదేశం పార్టీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు : పవన్‌ కల్యాణ్‌
    వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేయడమే జనసేన ముందున్న లక్ష్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తేల్చిచెప్పారు. వారాహి వాహనాన్ని ఆపేందుకు సీఎం సహా ఎవరొస్తారో రావాలని సవాల్‌ విసిరారు. మంత్రి అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ విరుచుకుపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మాచర్లలో ఎవరెం చేశారో.. ఆధారాలున్నాయి : డీఐజీ త్రివిక్రమ్‌వర్మ
    మాచర్ల ఘటనపై గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్‌వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఎవరెవరు ఏమేం చేశారో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు పార్టీల నేతలు పరస్పరం రెచ్చగొట్టుకున్నారని ఆయన తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పుట్టపర్తిలో కొనసాగుతున్న వైసీపీ కుమ్ములాటలు.. ఈ సారి కదిరి వేదికగా
    పుట్టపర్తి జిల్లాలో అధికార వైసీపీ నేతల అంతర్గత కుమ్ములాటలు.. మరింత తీవ్రంగా మారుతున్నాయి. మొన్నటి వరకు సమీక్షల్లో ఒకరిపై ఒకరు వ్యతిరేక వ్యాఖ్యలతో అసంతృప్త గళం వినిపించిన నేతలు, నిన్న ఏకంగా మంత్రి పెద్ద రెడ్డి కాన్వాయ్ పైనే చొప్పులు విసిరారు. తాజాగా కదిరి నియోజక వర్గం సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రాకముందే.. ఒకరికొకరు తోసుకుంటూ, కుర్చీలు విసురుకుంటూ.. వేదికపై గలాట సృష్టించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జగన్​కు 25 ఎంపీలు ఇస్తే, మోదీకి మసాజ్ చేస్తున్నారు : కేఏ పాల్
    రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినతి పత్రం సమర్పించారు. జగన్​కి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'నేను బతికే ఉన్నాను.. దయచేసి గుర్తించండి'.. ఆటో డ్రైవర్​ ఆవేదన!
    ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదం వల్ల బతికుండగానే రికార్డుల్లో మృతి చెందాడు ఓ వ్యక్తి. దీంతో తన కుటుంబం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఈశాన్య రాష్ట్రాలను విభజించే కుట్ర.. మేమే వాటిని అడ్డుకుంటున్నాం'
    ఈశాన్య ప్రాంతంలో ఇప్పటివరకు వచ్చిన అడ్డంకులకు ముగింపు పలికి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అవినీతి, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలను నిర్మూలించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • త్వరలో మూడు కరోనా వేవ్​లు.. 10 లక్షల మరణాలు.. చైనాలో ఇక విధ్వంసమే!
    కొవిడ్ ఆంక్షల సడలింపుతో చైనాలో రోజురోజుకూ కేసులు పెరుగుతుండగా.. తాజా నివేదిక మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఈ శీతాకాలంలో డ్రాగన్ 3 కరోనా వేవ్‌లను ఎదుర్కొవచ్చని.. నిపుణులు హెచ్చరించారు. ఇందులో ఒక వేవ్‌ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు.. 2023లో చైనావ్యాప్తంగా 10 లక్షలకు పైగా కొవిడ్ మరణాలు సంభవిస్తాయని అమెరికా పరిశోధన సంస్థ అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • క్రెడిట్​ స్కోర్​ తగ్గిందా?.. అయితే ఇలా పెంచుకోండి!
    తక్కువ క్రెడిట్‌ స్కోరున్న వారు రుణాలు తీసుకోవడం, క్రెడిట్‌ కార్డులు తీసుకోవడంలాంటి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో ఉద్యోగం ఇచ్చే సమయంలో సంస్థలూ ఈ స్కోరును గమనిస్తున్నాయి. మీ రుణ దరఖాస్తును పరిశీలించేటప్పుడు రుణదాత ప్రధానంగా పరిశీలించే అంశాల్లో క్రెడిట్‌ స్కోరే ముందుంటుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ స్కోరు అనుకున్నంత లేకపోతే దాన్ని మెరుగుపర్చుకునేందుకు ఏం చేయాలి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఫిఫా వరల్డ్​ కప్​లో మెరవనున్న దీపికా పదుకొణె ఏం చేయబోతోందో తెలుసా
    సాకర్​ మహాసంగ్రామంలో బాలీవుడ్​ భామ దీపికా పదుకొణె మెరవనుంది. ఫిఫా వరల్డ్​ కప్​ 2022 ట్రోఫీని ఈ భామ ఆవిష్కరించబోతోంది. దీనికోసం ఆదివారం ఉదయం ఖతార్​కు చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇదేంటీ కోవై సరళ అంతలా మారిపోయింది
    హాస్యనటనలో మగవాళ్లతో పోటీపడి తెలుగు ప్రేక్షకులు మనసు దోచుకుంది నటి కోవై సరళ. ప్రస్తుతం ఈ నటీమణి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.