ETV Bharat / state

విద్యానికేతన్​లో ఘనంగా.. పట్టభద్రుల దినోత్సవం

author img

By

Published : Jul 6, 2019, 6:11 PM IST

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్​బాబు నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో పట్టభద్రుల దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వినోద్ కుమార్ దుగ్గల్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

పట్టభద్రులకు ధ్రువపత్రాలను అందజేస్తున్న దుగ్గల్

పట్టభద్రులకు ధ్రువపత్రాలను అందజేస్తున్న దుగ్గల్

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో 8వ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మాజీ హోం సెక్రటరీ వినోద్ కుమార్ దుగ్గల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పుట్టుకతో ఎవరు గొప్ప వాళ్ళు కారని.. గొప్ప మనసు, తెలివితేటలు ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని విద్యాసంస్థల అధినేత మంచుమోహన్ బాబు అన్నారు. దుగ్గల్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ స్థితికి రావడానికి కారకులైన తల్లితండ్రులను ఆజన్మాంతం గుర్తుంచుకోవాలన్నారు. ఈ సంవత్సరం 1310 పట్టభద్రులు దుగ్గల్ చేతుల మీదగా ధ్రువపత్రాలను పొందారు.

ఇదీ చూడండి సీఎం టూర్ ఏర్పాట్లపై ఉపముఖ్యమంత్రి పర్యవేక్షణ

Intro:శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో 8వ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.


Body:ap_tpt_36_06_8th_graduation_day_avb_c5

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబు నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు 8వ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి మాజీ ప్రభుత్వ హోం సెక్రటరీ వినోద్ కుమార్ దుగ్గల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పుట్టుకతో ఎవరు గొప్ప వాళ్ళు కారని నీ గొప్ప మనసు, తెలివితేటలు ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు అన్నారు. దుగ్గల్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ స్థితికి రావడానికి కారకులైన తల్లిదండ్రులను ఆజన్మాంతం గుర్తుంచుకోవాలన్నారు. ఈ సంవత్సరం 1310 పట్టభద్రులకు దుగ్గల్ చేతుల మీదగా ధ్రువపత్రాలను అందజేశారు .


Conclusion:పి .రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.