ETV Bharat / sports

అమిత్​ షాను కలిసిన హార్దిక్​ పాండ్య.. కారణం ఏంటో?

author img

By

Published : Dec 31, 2022, 10:38 PM IST

టీమ్ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య కేంద్ర హోంమంత్రి అమిత్​ షాను కలిశారు. ఈ మేరకు తన సోషల్​ మీడియా ఖాతాలో ఫొటోలు షేర్​ చేశారు.

hardik pandya meets amith shah
hardik pandya meets amith shah

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​, టీ 20ఫార్మాట్ కెప్టెన్ హార్దిక్​ పాండ్య కేంద్ర హోంమంత్రి అమిత్​ షాను ఆయన నివాసంలో కలిశారు. హార్దిక్​తో పాటు అతడి సోదరుడు కృనాల్​ పాండ్య కూడా ఉన్నాడు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను హార్దిక్​ తన సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. తమను ఆహ్వానించినందుకు అమిత్​ షాకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సమావేశానికి గల కారణాన్ని వెల్లడించలేదు.

hardik pandya meets amith shah
కేంద్ర హోం మంత్రి అమిత్​ షాను కలిసిన పాండ్య సోదరులు

హార్దిక్​ పాండ్య శ్రీలంకతో జరగబోయే మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో టీమ్​ఇండియాకు సారథ్యం వహించనున్నాడు. కాగా, శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్​లో వైస్​ కెప్టెన్​గా బాధ్యతలు తీసుకోనున్నాడు. గాయం నుంచి బయటపడ్డ తర్వాత 2022 మొదట్లో మంచి కమ్​బ్యాక్​ ఇచ్చాడు ఈ ప్లేయర్​. ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో ఆల్​రౌండ్​ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కాగా, ఐపీఎల్​లో గుజరాత్​ టైటాన్స్​కు సారథ్యం వహించాడు. ఆ సమయంలోనే కెప్టెన్​గా జట్టును సమర్థంగా నడిపించి.. మొదటి ప్రయత్నంలోనే కప్పును అందుకున్నాడు. అప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడు కెప్టెన్​గా టీమ్​ను సమర్థంగా నడిపించాడు. అయితే అంతకుముందు కూడా ఐర్లాండ్​, న్యూజిలాండ్​తో జరిగిన సిరీసుల్లో టీమ్​ఇండియాకు కెప్టెన్​గా వ్యవహరించాడు. కాగా, హార్దిక్​ పాండ్య ప్రదర్శనపై మాజీ టీమ్ఇండియా ఆడగాడు సంజయ్​ మంజ్రేకర్​ స్పందించారు. హార్దిక్​.. కెప్టెన్​గా ఐపీఎల్​లో సక్సెస్​ అవుతాడని చాలా మంది నమ్మలేదని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.