ETV Bharat / sports

సచిన్​కు ఉన్న ఏకైక ఆలోచన అదే!

author img

By

Published : Jul 31, 2020, 2:27 PM IST

Updated : Jul 31, 2020, 2:33 PM IST

సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో సరదా పోస్టులను పంచుకుంటూ ఉంటాడు క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందూల్కర్. తాజాగా వర్షంలో తడుస్తూ.. ఆస్వాదిస్తున్నప్పటి ఫొటోను పోస్ట్​ చేశాడు.

Sachin Tendulkar Talks About "The Only Worry One Had" In His Throwback Picture
సచిన్​

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​, లిటిల్​ మాస్టర్​ సచిన్​ తెందూల్కర్​ తరచూ సోషల్​ మీడియాలో సరదా పోస్టులను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా​ వర్షంలో తడుస్తూ ఆనందంగా ఆస్వాదిస్తున్న ఫొటోను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పోస్ట్​ చేశాడు. ఈ క్రమంలోనే "వర్షం గురించి మాత్రమే ఆలోచించిన సందర్భాన్ని మీరు కూడా గుర్తు తెచ్చుకోండి" అంటూ రాసుకొచ్చాడు. కరోనా మహమ్మారి కారణంగా ఈ బ్యాటింగ్​ లెజెండ్​ ప్రస్తుతం తన కుటుబుంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు.

క్రికెట్ చరిత్రలోనే సచిన్​ అద్భుతమైన ఆటగాడు. 1989లో పాకిస్థాన్​తో జరిగిన టెస్టు మ్యాచ్​తో భారత్​ తరఫున అరంగేట్రం చేసిన లిటిల్​ మాస్టర్​.. తన కెరీర్​లో 200 టెస్టు మ్యాచ్​లు ఆడిన ఏకైక క్రికెటర్​గా గుర్తింపు సాధించాడు. ఈ ఫార్మాట్​లో మొత్తం 15, 921 పరుగులు చేశాడు.

వన్డేలో మొత్తం 463 మ్యాచ్​లు ఆడగా.. 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలతో 18, 426 పరుగులు సాధించాడు. 2010లో 50 ఓవర్ల ఫార్మాట్​లో డబుల్​ సెంచరీ చేసి.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్​మన్​గా చరిత్ర సృష్టించాడు.

Last Updated :Jul 31, 2020, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.