ETV Bharat / entertainment

300మందితో రామ్​ పోతినేని ఫైట్.. ఈ సారి చరణ్​ లేకుండానే RC 15

author img

By

Published : Jan 28, 2023, 3:56 PM IST

Ram potineni Boyapati movie 300 men big  fight  sequence
300మందితో రామ్​ పోతినేని ఫైట్.. చెర్రీ​ లేకుండానే RC 15

స్టైలిష్‌గా కనిపిస్తూనే మాస్‌ పాత్రలతో అలరించే కథానాయకుడు రామ్‌. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్​ బయటకు వచ్చింది. ఏకంగా 300మందితో రామ్​పై ఫైటింగ్​ సీక్వెన్స్​ తెరకెక్కిస్తున్నారని తెలిసింది. అలాగే రామ్​చరణ్​ 'ఆర్​సీ 15' సినిమా అప్డేట్​ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు..

అభిమానులు, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు తన ఆహార్యాన్ని మార్చుకుంటూ, విభిన్నపాత్రలతో మెప్పించే ఎనర్జిటిక్​ హీరో రామ్ పోతినేని. ఇస్మార్ట్​ శంకర్​, రెడ్ వంటి హిట్​ సినిమాలతో మాస్​ కథల జోనర్​పై ఫోకస్​ పెట్టారు. అలా ఆయన చివరిగా దర్శకుడు లింగుస్వామితో చేసిన వారియర్​ సినిమా భారీ డిజాస్టర్​గా నిలిచింది. అయినా ఆయన మళ్లీ మాస్​ జోనర్​పైనే దృష్టి పెట్టి డైరెక్టర్​ బోయపాటితో చేతులు కలిపారు. ఈ సారి ఎలాగైనా సరైనా హిట్​ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నారు. ఇక బోయపాటి అంటే కూడా భారీ యాక్షన్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే​. ఇప్పటికే ఆయన అఖండ లాంటి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో రామ్​తో చేయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. పాన్​ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ చిత్రంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుండట. ఏకంగా 300 మంది​తో స్పెషల్​ యాక్షన్​ సీన్​ను రూపొందిస్తున్నారట. వారందరితో రామ్​ తలపడేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్​గా ఉండనుందట. పవర్ ఫుల్​గా దీన్ని చిత్రీకరించనున్నారని టాక్​ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమా కథ విషయానికొస్తే ఓ కొత్త ప్రచారం వినిపిస్తోంది. ఈ మూవీ పొలిటికల్ టచ్ కాన్సెప్ట్​తో రూపొందుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలోని సీఎం పాత్రే ప్రతినాయకుడిగా కనిపిస్తారని సమాచారం.

ఆర్​సీ 15 షూటింగ్​ అప్డేట్​.. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఆర్​ సీ 15' చేస్తున్నారు. పాన్ ఇండియ‌న్ స్థాయిలో భారీ బడ్జెట్​తో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోంది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకోనున్న‌ ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్​ షూటింగ్ అప్డేట్స్​ బయటకు వచ్చాయి. కొత్త షెడ్యూల్​ హైదరాబాద్​, రాజమండ్రి నగరాల్లో జరగనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం. ఇందులో చ‌ర‌ణ్ లేకుండా ప్ర‌ధాన పాత్ర‌ల‌పై ద‌ర్శ‌కుడు శంక‌ర్ కీల‌క స‌న్నివేశాల‌ను షూట్ చేయ‌బోతున్న‌ారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో చ‌ర‌ణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా, అవినీతిని ఎదురించే పోరాట యోధుడిగా క‌నిపించ‌నున్నారు. కియారా అద్వాణీ, అంజలి హీరోయిన్స్​​. ఎస్‌జే సూర్య విల‌న్‌. పూర్తి పొలిటికల్​ టచ్​లో ఈ సినిమాలు న‌వీన్‌చంద్ర‌, సునీల్‌, అంజ‌లి కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌నున్నారు. పిజ్జా, పేట, పెంగ్విన్‌, మహాన్‌ వంటి చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఈ చిత్రానికి కథ అందించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

ఇదీ చూడండి: నెం.1,2గా 'జై భీమ్‌', 'జనగణ మన'.. టాప్‌ 10 కోర్టురూమ్‌ డ్రామా మూవీస్​ ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.