ETV Bharat / city

JAGAN-KISHAN REDDY MEET: ముఖ్యమంత్రి జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

author img

By

Published : Aug 19, 2021, 3:07 PM IST

Updated : Aug 19, 2021, 7:34 PM IST

Kishan Reddy Meet CM Jagan
ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

15:01 August 19

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  ముఖ్యమంత్రి జగన్‌ను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని జగన్​ నివాసానికి వచ్చిన కిషన్‌రెడ్డి దంపతులకు.. జగన్ - భారతి దంపతులు స్వాగతం పలికి సన్మానించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా విజయవాడకు చేరుకున్న కిషన్​రెడ్డి.. జగన్​తో భేటీ అయ్యారు. అరగంటపాటు జరిగిన భేటీలో వివిధ అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు.

కిషన్‌రెడ్డి దంపతులను సీఎం జగన్, భారతి దంపతులు సన్మానించారు. కిషన్‌రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి.. నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.  

ఇదీ చదవండి...

kishan reddy: ఏపీ ప్రభుత్వం భాజపా శ్రేణులను వేధిస్తోంది: కిషన్‌రెడ్డి

cm jagan on Fake Challan Scam: ఏసీబీ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా?: జగన్‌

Last Updated :Aug 19, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.