ETV Bharat / city

omicron : కర్నూలు జిల్లాలో 80 మందికి ఒమిక్రాన్.. రిపోర్ట్ కలకలం!

author img

By

Published : Dec 26, 2021, 10:19 PM IST

80 మందికి ఒమిక్రాన్
80 మందికి ఒమిక్రాన్

కర్నూలు జిల్లాలో 80 మందికి ఒమిక్రాన్ నిర్థరణ అయినట్లు.. వైద్యశాఖ వెబ్​సైట్​లో నమోదు చేయడం కలకలం రేపింది. అయితే.. వాలంటీర్ తప్పుగా నమోదు చేశారని తర్వాత తేలింది. దీంతో.. మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు.

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని తోవి గ్రామంలో ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 80 మందికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు.. వైద్యశాఖ వెబ్​సైట్​లో వాలంటీర్ తప్పుగా నమోదు చేశారు. వాలంటీర్ తప్పిదంతో.. గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే.. పొరపాటు జరిగిందని గ్రహించిన అధికారులు.. గ్రామంలోని 80 మందికి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.