ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM

author img

By

Published : Sep 21, 2022, 9:00 PM IST

Top News 9 pm Ap
ఏపీ ప్రధాన వార్తలు

ఏపీ ప్రధాన వార్తలు

  • వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఎన్నిక చెల్లదు: సీఈసీ
    CEC ON JAGAN : వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఎంపిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన సీఈసీ.. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలని స్ఫష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జగన్​లా ఆలోచించి ఉంటే.. రాష్ట్రంలో వైఎస్సార్​ పేరు కనిపించేదా..!: చంద్రబాబు
    CBN ON NTR HEALTH UNIVERSITY : తెలుగుదేశం ప్రభుత్వం కూడా జగన్​లా ఆలోచించి ఉంటే.. రాష్ట్రంలో వైఎస్సార్ పేరు ఎక్కడా ఉండేది కాదని మండిపడ్డారు. తెలుగుజాతికి ప్రతీకగా నిలిచే ఎన్టీఆర్ పేరును యూనివర్సిటీకి తొలగించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. నిర్మాణానికి తట్ట మట్టి కూడా వేయనివాడు పేర్లు మార్చే నీచ సంస్కృతికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి చేష్టలతో పిచ్చి తుగ్లక్​గా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని దుయ్యబట్టారు. యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టే వరకూ తెలుగుదేశం నిర్విరామ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వ వైఫల్యాల దృష్టి మరల్చేందుకే.. పేరు మార్పు : సీఎం రమేశ్​
    BJP MP CM RAMESH : ఎన్టీఆర్‌ అంటే ఆంధ్రులందరికీ ప్రత్యేకమైన అభిమానం.. హెల్త్‌ యూనివర్సిటీకి ఉన్న ఆయన పేరును తొలగించడం ఒక పిచ్చి చర్య అని భాజపా ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మౌలిక వసతులు కల్పించకుండా.. పేరు మార్చి ఏం సాధిస్తారు..?: పవన్​
    PAWAN KALYAN : హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చి పాలకులు ఏం సాధిస్తారని జనసేన అధినేత పవన్‌ ప్రశ్నించారు. ఎన్టీఆర్​ బదులు వైఎస్‌ఆర్‌ పెడితే వసతులు మెరుగవుతాయా అని నిలదీశారు. వసతుల కల్పన వదిలేసి పేర్లు మార్చడం అర్థంలేని చర్య అని వ్యాఖ్యానించారు. కొత్త వివాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రభుత్వం ఈ పని చేసిందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'దేశం ఎటువైపు పోతోంది?'... సుప్రీంకోర్టు ఆవేదన
    విద్వేషపూరిత ప్రసంగాలపై మీడియాకు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. దేశం ఎటువైపు వెళ్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. టీవీలో జరిగే చర్చల్లో యాంకర్లకు పెద్ద బాధ్యత ఉందని..కానీ టీవీ యాంకర్లు అతిథికి సమయం కూడా ఇవ్వరని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పీఎం కేర్స్​ ఫండ్​' ట్రస్టీగా రతన్​ టాటా.. వారిపై మోదీ ప్రశంసలు
    PM Cares fund: పీఎం కేర్స్​ ఫండ్​ ట్రస్టీలుగా వ్యాపార దిగ్గజం రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కేటీ థామస్ సహా మరికొందరు ప్రముఖులు చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలో జరిగిన సమావేశానికి వారంతా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మానవులు విశ్వవ్యాప్తం'.. అంతరిక్ష నివాసానికి నాసా ఏర్పాట్లు.. కీలక ప్రకటన
    అంతరిక్షంలో మానవుల ఉనికిని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కీలక బ్లూప్రింట్​ను విడుదల చేసింది. అంతరిక్ష ప్రయాణాలు, నివాసం; చంద్రుడు, మార్స్​పై అవసరమయ్యే మౌలిక సదుపాయాల గురించిన వివరాలను అందులో పొందుపర్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డబ్బే డబ్బు.. అదానీ సంపాదన రోజుకు రూ.1,600 కోట్లు.. మొత్తం ఎంతంటే?
    బ్లూమ్‌బర్గ్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ సంపద... గత ఏడాది 116 శాతం పెరిగినట్లు 'ఐఐఎఫ్ఎల్ వెల్త్‌' జాబితా వెల్లడించింది. గత ఏడాది రోజుకు సగటున రూ.1,612 కోట్లు అదానీ ఆర్జించినట్లు తెలిపింది. మొత్తంగా రూ.10.94లక్షల కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత కుబేరుడిగా అదానీ అవతరించినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Rankings: పాక్​ కెప్టెన్​ను వెనక్కినెట్టిన సూర్య.. కోహ్లీ మాత్రం!
    ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌ జాబితా విడుదలైంది. ఇందులో టీమ్​ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అదరగొట్టాడు. కోహ్లీ మళ్లీ ఓ స్థానం కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆర్​ఆర్​ఆర్​పై ​ బ్రిటిషర్స్​ విమర్శలు.. స్పందించిన జక్కన్న
    ఆర్​ఆర్​ఆర్​లో తమను తక్కువగా చూపించారంటూ పలువురు బ్రిటిషర్లు ఆరోపించిన నేపథ్యంలో స్పందించారు దర్శకుడు రాజమౌళి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.