'దేశం ఎటువైపు పోతోంది?'... సుప్రీంకోర్టు ఆవేదన

author img

By

Published : Sep 21, 2022, 5:31 PM IST

Etv BharatSlug  supreme court on hate speeches

విద్వేషపూరిత ప్రసంగాలపై మీడియాకు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. దేశం ఎటువైపు వెళ్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. టీవీలో జరిగే చర్చల్లో యాంకర్లకు పెద్ద బాధ్యత ఉందని..కానీ టీవీ యాంకర్లు అతిథికి సమయం కూడా ఇవ్వరని అభిప్రాయపడింది

SC ON Hate Speeches : విద్వేషపూరిత ప్రసంగాల అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీడియాలో, సోషల్ మీడియాలో చాలా ద్వేషపూరిత ప్రసంగాలు వస్తున్నాయన్న సర్వోన్నత న్యాయస్థానం.. మన దేశం ఎటువైపు వెళుతుందోనని ఆవేదన వ్యక్తం చేసింది.

టీవీలో జరిగే చర్చల్లో యాంకర్లకు పెద్ద బాధ్యత ఉందని..కానీ టీవీ యాంకర్లు అతిథికి సమయం కూడా ఇవ్వరని అభిప్రాయపడింది. ఇలాంటి వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషీకేశ్ రాయ్ ధర్మాసనం.. కఠినమైన నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై రెండు వారాల్లో సమాధానంఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 23కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి: 'పీఎం కేర్స్​ ఫండ్​' ట్రస్టీగా రతన్​ టాటా.. వారిపై మోదీ ప్రశంసలు

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి వేట.. గురువారమే నోటిఫికేషన్.. గెలిచే ఛాన్స్ ఆయనకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.