ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : Sep 7, 2022, 9:00 PM IST

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

ఏపీ ప్రధాన వార్తలు

  • సీపీఎస్‌ రద్దు హామీ తొందరపాటన్న బొత్స.. జీపీఎస్​ ఒప్పుకునేది లేదన్న ఉద్యోగులు
    Ministers committee discussions on CPS: ఎట్టి పరిస్థితుల్లోనూ సీపీఎస్​ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్​కు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ఇదిలావుంటే.. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఏదో తొందరపాటులో హామీ ఇచ్చామని.. జీపీఎస్​లోనూ ఇంకా సదుపాయాలు పెంచుతామని మంత్రి బొత్స తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • AP Cabinet Decisions: ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..
    AP Cabinet Decisions: వైఎస్సార్ చేయూత పథకానికి నిధుల విడుదల సహా పలు నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా 6 జిల్లాల్లో తాగునీరు అందించేందుకు.. 4020 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. గ్రామ సచివాలయ సిబ్బంది ప్రొబేషన్ డిక్లరేషన్ ర్యాటిఫికేషన్‌కు ఆమోదం సహా పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Chandrababu: ఆ జిల్లా తెదేపా నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి
    Chandrababu: కృష్ణా జిల్లా తెదేపా నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలు చిత్తశుద్ధితో పని చేయాలని హెచ్చరించారు. చెన్నుపాటి గాంధీ వ్యవహారంలో.. సరిగా పోరాటం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Nellore SP: మద్యం మత్తులో.. చెవిదిద్దుల కోసం బాలికపై దాడి : నెల్లూరు ఎస్పీ
    Acid Attack case: చెవిదిద్దులు ఇవ్వాలని బాలికపై మేనమామ దాడి చేశాడని నెల్లూరు ఎస్పీ తెలిపారు. చాకుతో బాలికపై దాడి చేసినట్లు వివరించారు. నిందితుడిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్​ జోడో యాత్ర షురూ.. రాహుల్​ నేతృత్వంలో దేశమంతా..
    Bharat Jodo Yatra : 2024 సార్వత్రిక ఎన్నికలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ 'భారత్ జోడో' యాత్ర మొదలైంది. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ వరకు తలపెట్టిన యాత్రను ప్రారంభించారు. 12 రాష్ట్రాల నుంచి 3,570 కిలోమీటర్ల పొడవున ఈ పాదయాత్ర సాగనుంది. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం సహా దేశంలో భాజపాయేతర శక్తులను కూడగట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ రాజకీయ పార్టీలపై ఐటీ దాడులు.. దేశవ్యాప్తంగా సోదాలు.. బంగాల్ మంత్రికి సీబీఐ సెగ
    ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తోంది. ఈసీ జాబితాలో ఉండి, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు, బంగాల్​ మంత్రి మొలోయ్‌ ఘఠక్​కు చెందిన ప్రాంతాలపై సీబీఐ సోదాలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పుతిన్​ సమక్షంలో యుద్ధ విన్యాసాలు.. 3వేల మిలిటరీ విభాగాల నుంచి సేనలు!
    రష్యా నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాలకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం హాజరయ్యారు.. వస్టాక్‌-2022 పేరుతో భారీఎత్తున నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో భారత్​తో సహా పలు దేశాలు పాల్గొంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 10 కోట్లు దాటిన డీమ్యాట్​ ఖాతాలు.. రెండేళ్లలో భారీగా పెరిగిన సంఖ్య
    దేశంలోని డీమ్యాట్​ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొవిడ్​ ముందు సుమారు 4 కోట్లు ఉన్న ఖాతాలు ఇప్పుడు ఏకాంగా పది కోట్లకు చేరిందని ట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ గణాంకాలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆసియాకప్​లో రోహిత్​ శర్మ ఘనత.. సచిన్​ రికార్డు బద్దలు
    ఆసియా కప్​లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మ​ పలు రికార్డులు సాధించాడు. ఆ రికార్డులేంటో చూద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రజనీకాంత్​ ఆఫర్​ను రిజెక్ట్​ చేసిన మణిరత్నం​.. కారణం ఏంటంటే?
    సాధారణంగా రజనీకాంత్​ తమ చిత్రంలో నటిస్తానంటే ఏ దర్శకుడైనా కాదనకుండా పాత్ర ఇస్తారు. అలాంటి ఆయన్ను దర్శకుడు మణిరత్నం​ రిజెక్ట్​ చేశారట. ఎందుకంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.