ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : Apr 28, 2022, 8:59 PM IST

9pm To news
9pm To news

.

  • ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూత
    బాలాజీ హేచరీస్‌ అధినేత సుందరనాయుడు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
    పేదలకు మంచి చేద్దామంటే ప్రతిపక్షాలు, మీడియా అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి జగన్‌ మండిపడ్డారు. పేదల ఇళ్లు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, మూడు రాజధానులు సహా అన్నింటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అసమర్థ పాలనతో సీఎం జగన్ ఎప్పుడో జీరో అయ్యారు: చంద్రబాబు
    వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సీఎం జగన్​కు అర్థమైందని.., దాన్ని కప్పిపుచ్చేందుకే 175 సీట్లు గెలుస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అసమర్థ పాలనతో జగన్ ఎప్పుడో జీరో అయ్యారని.. మళ్లీ గెలవటానికి ఏం సాధించారని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దుగ్గిరాల అత్యాచార ఘటనలో ట్విస్ట్
    గుంటూరు జిల్లా దుగ్గిరాలలో హత్యాచార ఘటనపై గుంటూరు అర్భన్​ ఎస్పీ స్పందించారు. సదరు మహిళపై అసలు అత్యాచారమే జరగలేదని.. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని ఎస్పీ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈశాన్య రాష్ట్రాల్లో ఆ చట్టం ఎత్తివేత: ప్రధాని మోదీ
    సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా ఎత్తివేయనున్నట్లు వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. అసోంలో నిర్వహించిన ర్యాలీలో ఈ విషయాన్ని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రధాని వ్యాఖ్యలు'
    ఇంధన ధరలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే.. ఇంధన ధరలు పెరుగుతున్నాయని మోదీ వ్యాఖ్యానించటాన్ని తప్పుపట్టారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జీ హుజూర్​' అనకపోతే అంతు చూస్తామంటున్న మాస్కో!
    రష్యా-ఉక్రెయిన్​ల మధ్య గత 63 రోజులుగా భీకర యుద్ధం జరుగుతోంది. యుద్ధం మొదలై ఇన్ని రోజులు గడుస్తున్నా రష్యా.. ఉక్రెయిన్​ను ఆక్రమించుకోలేకపోతుంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం అంటూ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నారు అధ్యక్షుడు​ పుతిన్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు- రిలయన్స్ నయా రికార్డ్
    స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత సెషన్​లో నష్టపోయిన దేశీయ సూచీలు.. గురువారం లాభాల బాటపట్టాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 701 పాయింట్లు పెరిగి.. 57 వేల 521 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 206 పాయింట్లు లాభపడి 17 వేల 245 వద్ద సెషన్​ను ముగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్వార్టర్​ ఫైనల్స్​కు సింధు, సాత్విక్​-చిరాగ్​ జోడీ
    ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీసింధు, సాత్విక్​ సాయిరాజ్​ రంకిరెడ్డి-చిరాగ్​ శెట్టి అదరగొట్టారు. గురువారం జరిగిన పోటీల్లో గెలిచి క్వార్టర్​ ఫైనల్స్​కు అర్హత సాధించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టార్​ నటుల 'హిందీ' వార్​కు పొలిటికల్ ట్విస్ట్
    కన్నడ స్టార్‌ నటుడు కిచ్చా సుదీప్‌, బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ మధ్య జరిగిన ట్విట్టర్‌ 'యుద్ధం'.. చిలికిచిలికి గాలివానగా మారుతోంది. జాతీయ భాషపై ఈ నటుల మధ్య జరిగిన ట్వీట్ల వార్‌ మధ్యలోకి ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రవేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.