ETV Bharat / bharat

'సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రధాని వ్యాఖ్యలు'

author img

By

Published : Apr 28, 2022, 12:15 PM IST

Rahul Gandhi On Fuel Prices: ఇంధన ధరలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే.. ఇంధన ధరలు పెరుగుతున్నాయని మోదీ వ్యాఖ్యానించటాన్ని తప్పుపట్టారు.

Rahul Gandhi On Fuel Prices
Rahul Gandhi On Fuel Prices

Rahul Gandhi On Fuel Prices: ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే.. ఇంధన ధరలు పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించుకోవాలని మోదీ బుధవారం సూచించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సమాఖ్య స్ఫూర్తి దెబ్బతీసేలా.. ప్రధాని వ్యాఖ్యలున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. మొత్తం ఇంధన పన్నుల్లో 68శాతం కేంద్రం విధిస్తూ.. రాష్ట్రాలను నిందించడం సరైనది కాదని ధ్వజమెత్తారు. అధిక ఇంధన ధరలు, బొగ్గు కొరత, ఆక్సిజన్ కొరత.. ఇలా అన్ని వైఫల్యాలను రాష్ట్రాలపై నెట్టివేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. గత నవంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. వాటిపై రాష్ట్రాలు విధిస్తున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాలని కేంద్రం చేసిన పిలుపును చాలా రాష్ట్రాలు పాటించడం లేదని మోదీ లేవనెత్తారు. దీంతో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.

తమిళనాడు కౌంటర్​: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించకముందే తమిళనాడు ప్రభుత్వం వ్యాట్​ను తగ్గించిందన్నారు ఆ రాష్ట్ర ఆర్థిక, మానవ వనరుల శాఖ మంత్రి. 2021 ఆగస్టులోనే తగ్గించామని గుర్తు చేశారు. దీని వల్ల రాష్ట్ర పౌరులకు లీటరుకు రూ.3 ఉపశమనం లభించిందన్నారు.

ఇదీ చదవండి: కేరళలో మరోసారి షిగెల్లా కలకలం.. కోజికోడ్​​లో తొలి కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.