ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : May 6, 2022, 11:00 AM IST

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM

..

  • తిరుపతిలో అమానవీయం.. మృతదేహం తరలింపునకు 108 నిరాకరణ.. బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి
    రాష్ట్రంలో వరుసగా అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్​ మాఫియాతో.. మృతదేహాన్ని బైక్​పై తీసుకెళ్లగా.. నిన్న నెల్లూరు జిల్లా సంగం ఆస్పత్రిలో మృతదేహం తరలించేందుకు అంబులెన్స్​ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో కుమారుడి మృతదేహాన్ని తండ్రి బైక్​పైనే తీసుకెళ్లిన ఘటన జరిగింది. తాజాగా తిరుపతి జిల్లాలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అనకాపల్లి జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం..!
    Rape on Minor: అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. పక్కింట్లో ఉంటున్న సాయి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాత్రి 2గంటల సమయంలో అక్కాచెల్లెల్లు బహిర్భూమికి వెళ్లగా.. నిందితుడు బాలికను లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Intermediate exams: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
    Intermediate exams: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. 9.14 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నఈ పరీక్షల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎంపీ రామ్మోహన్​నాయుడికి మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశంస
    Minister Appalaraju praises MP Rammohan naidu: తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుపై మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా గొప్ప నాయకుడని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో.. ప్రయాణికుల కోసం బెంచీలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ జిల్లాలో మంకీ ఫీవర్ కలకలం.. ఆసుపత్రులకు జనం పరుగులు!​
    monkey fever in karnataka: మంకీ ఫీవర్​.. కర్ణాటక శివమొగ్గ జిల్లాలో మరోమారు కలకలం సృష్టిస్తోంది. కోతుల నుంచి వచ్చే ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈనెల 3వ తేదీన సాగర్​ తాలుకా అరళగోడ్​లో ఓ వ్యక్తి మరణించటం వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెరుచుకున్న కేదార్​నాథ్​ ఆలయం.. మోదీ తొలిపూజ!
    kedarnath: ఉత్తరాఖండ్​లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్​నాథ్​ ఆలయం ఆరునెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకుంది. శుక్రవారం ఉదయం 6.25 గంటలకు వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు. అంతకుముందు ప్రధాన పూజారి నివాసం నుంచి కేదార్​నాథుడి డోలీని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం.. 53 మంది మృతి
    చైనా, సెంట్రల్​ హునాన్​ ప్రావిన్స్​లోని గత వారం ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా...
    Gold Rate Today: బంగారం ధర క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. వెండి ధర రూ.1300కి పైగా దిగొచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'హిట్​ మ్యాన్'కు తోడుగా మరో క్రికెటర్​.. ఐపీఎల్​లో 14 సార్లు డకౌట్​
    ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో అత్యధికసార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు ముంబయి సారథి రోహిత్​ శర్మ. మొత్తం 14 సార్లు పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు హిట్​ మ్యాన్​. ఇప్పుడీ జాబితాలో మరో క్రికెటర్​ చేరాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Sarkaruvaari pata: మహేశ్ గ్లామర్​ పెరగడానికి అసలు కారణం అదేనట!
    Sarkaru vaari pata Mahesh Galmour secret: సూపర్​స్టార్​ మహేశ్​బాబు గ్లామర్​ సీక్రెట్​ను లీక్​ చేశారు ఫైట్​ మాస్టర్స్​ రామ్​-లక్ష్మణ్​. దీంతోపాటే మహేశ్​ ఎంతో క్రమశిక్షణగా ఉంటారని, ఎప్పుడూ వర్క్​పైనే దృష్టి పెడతారని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.