టీడీపీ సానుభూతిపరులపై పోలీసుల దాష్టీకం- నిర్బంధించి రెండ్రోజుల పాటు చిత్రహింసలు - Police Attack on TDP Sympathizers

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 8:03 PM IST

thumbnail
టీడీపీ సానుభూతిపరులపై పోలీసుల దాష్టీకం- నిర్బంధించి రెండ్రోజుల పాటు చిత్రహింసలు (ETV Bharat)

Police Attack on TDP Sympathizers: పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు తెలుగుదేశం సానుభూతిపరులను నిర్బంధించి విపరీతంగా కొట్టిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన టీడీపీ  సానుభూతిపరులు ఈ నెల 14న దాచేపల్లి వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని స్టేషన్​కు తీసుకెళ్లారు. వారిపై విచక్షణరహితంగా లాఠీలతో విరుచుకుపడినట్లు బాధితులు తెలిపారు. బాధితుల్లో అనిల్ అనే ఐటీ ఉద్యోగి కూడా ఉన్నారు. రెండ్రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి ఈ నెల 16న సత్తెనపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.

పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసిన విషయం బాధితులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లగా గుంటూరు జీజీహెచ్​లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బాధితులను ఆసుపత్రికి తీసుకువచ్చిన పోలీసులు వారికి ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇవ్వాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. దీనికి వైద్యులు అంగీకరించలేదు. విషయం తెలిసి జీజీహెచ్​కు వెళ్ళిన మీడియా ప్రతినిధుల్ని కూడా పోలీసులు అడ్డుకోవాలని ప్రయత్నించారు. కరుడుగట్టిన వైఎస్సార్సీపీ కార్యకర్తల కన్నా పోలీసులే దారుణంగా వ్యవహరించారని బాధితులు ఆవేదన వెలిబుచ్చారు. మోర్జంపాడు ఎంపీటీసీపై దాడి జరిగిందనే విషయం తెలిసి ఆసుపత్రికి వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.