కల్తీ మద్యానికి ఐదుగురు బలి.. ఆ ఎన్నికలే కారణమట!

author img

By

Published : Sep 10, 2022, 1:12 PM IST

poisonous liquor

కల్తీ మద్యం తాగి ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది.

poisonous liquor Uttarakhand : కల్తీ మద్యం తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని ఫుల్​గఢ్,​ శివగఢ్​​ గ్రామాల్లో శనివారం జరిగింది.
ఫుల్‌గఢ్ గ్రామానికి చెందిన రాజు, భోలా అనే ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో మృతుడు మనోజ్.. శివగఢ్​కు చెందినవాడు. జాలీ గ్రాంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించగా.. రిషికేశ్​​లోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. హరిద్వార్​లో పంచాయతీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనుండడం వల్ల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం సరఫరా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ప్రజలకు మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: బైక్​పైకి దూసుకెళ్లిన కార్.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి

దేశంలోనే అతి పొడవైన వంతెన నిర్మాణం.. ఇక సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపు ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.