36 బైకులు, 8 కార్లను కాల్చి బూడిద చేసిన సిగరెట్​ పీక - ఆకతాయిల పనే

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 1:38 PM IST

thumbnail

Scrap Vehicles were Burnt at Ramachandrapuram Police Station : ఆకతాయిలు చేసిన పనికి వివిధ కేసుల్లో ఉన్న స్క్రాప్ వాహనాలు తగులబడిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగింది. సంగారెడ్డి జిల్లా సరిహద్దు లింగంపల్లి కూడలి పోలీస్ క్వార్టర్స్​లో రామచంద్రాపురం, చందానగర్ ఠాణాలకు చెందిన వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఉంచారు. ఆ ప్రదేశం చుట్టుపక్కల పిచ్చి మొక్కలు పెరిగి ఎండిపోయాయి. ఆదివారం సాయంత్రం కొందరు ఆకతాయిలు ప్రహరీకి ఆనుకుని సిగరెట్లు కాల్చి వాటిని పిచ్చి మొక్కల్లోకి విసిరారు. క్రమేపీ మంటలు వ్యాపించి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కూడిన మంటలు అలుముకున్నాయి.

Fire Accident in Sangareddy : మంటల్లో వివిధ కేసులకు సంబంధించిన 36 బైకులు, 8 కార్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఫైర్​ సిబ్బందికి సమాచారం అందించారు. పటాన్​చెరు, బీహెచ్​ఈఎల్​ (బెల్) పరిశ్రమలకు చెందిన రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.