బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ ఓడలా మునిగిపోబోతుంది : రఘునందన్​ రావు - Raghunandan Rao comments

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 5:09 PM IST

thumbnail

Raghunandan Rao on BRS as Titanic : బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్న టైటానిక్ ఓడ వంటిదని, ఏ క్షణాన మునిగిపోతుందో ఎవరికీ తెలియదని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ ​రావు ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్​లో పర్యటించిన ఆయన, ప్రముఖ దేవాలయం చాకరిమెట్ల ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివ్వంపేటలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు, నాయకులు సంఘటితంగా ఉండి, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

బీఆర్ఎస్ త్వరలో కనమరుగు కాబోతోందని రఘునందన్​ రావు పేర్కొన్నారు. తాను నాస్తికుడినని చెప్పుకునే కేటీఆర్​కు ఇప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు వాస్తవ పరిస్థితులను వివరించి, బీజేపీలోకి ఆహ్వానించాలని కాషాయ నేతలకు ఆయన సూచించారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపేనని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి తెలియపరచాలన్నారు. రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.