LIVE : పటాన్​చెరులో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 10:15 AM IST

Updated : Mar 5, 2024, 12:29 PM IST

thumbnail

PM Modi Sangareddy Tour Live Today : రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కలిసి రూ.9 వేల కోట్లతో చేపట్టే వివిధ కార్యక్రమాలకు వర్చువల్​గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తున్న ప్రధాని, పలు అభివృద్ధి పనులను జాతికి అంకితం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్​ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి వర్చువల్​గా హాజరయ్యారు. అంతకుముందు రెండో రోజు పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని నరేంద్ర మోదీ దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత, బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సంగారెడ్డి జిల్లాకు బయలుదేరారు. అదే వేదికగా రూ.1,409 కోట్లతో చేపట్టిన హైవేను ప్రారంభించారు. నాందేడ్-అఖోలా ఎన్‌హెచ్‌-161ను జాతికి అంకితం చేశారు. అనంతరం పటాన్‌చెరులో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరుకానున్నారు. ఈ సభా వేదికగా ప్రధాన మంత్రి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారం యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. మోదీ పర్యటన సందర్భంగా పట్టణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Last Updated : Mar 5, 2024, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.