LIVE : భారత్ జాగృతి ఆధ్వర్యంలో ధర్నాచౌక్లో ఎమ్మెల్సీ కవిత దీక్ష - ప్రత్యక్షప్రసారం
Published : Mar 8, 2024, 11:14 AM IST
|Updated : Mar 8, 2024, 4:17 PM IST
MLC Kavitha Live : మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత నిర్ణయంతో మహిళలకు 33 శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ఆరోపిస్తున్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి ఆమె లేఖ రాశారు. ప్రజల రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల స్పూర్తిని పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీఓ తీసుకురావడాన్ని కవిత తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయంతో నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తాజాగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ధర్నాచౌక్ వద్ద జీవో 3 వల్ల రిజర్వేషన్ల అమలులో మహిళలకు అన్యాయంపై దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.