నేను ఏమైనా డమ్మీనా - నా తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి? విలేకరి ప్రశ్నకు మంత్రి బొత్స అసహనం - minister botsa angry on reporter

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 5:10 PM IST

thumbnail

Minister Botsa Satyanarayana Angry on Reporter Question: మంత్రి బొత్ససత్యనారాయణకు ఒక్కసారిగా కోపం వచ్చింది. మీడియా సమావేశంలో తీవ్ర అసహనం ప్రదర్శించారు. విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కూటమి ఉత్తరాంధ్రలో స్థానికేతరులకు అవకాశం ఇస్తుందని బొత్స విమర్శించారు. ఇదే సమయంలో ఓ విలేకరి వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తల పేరిట స్థానికేతరులను తీసుకొచ్చి పెత్తనం అప్పజెప్పారు కదా అని ప్రశ్నించారు. దీంతో కోపంగా తాను డమ్మీనా అంటూ ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర విశ్వవిద్యాలయాలకు ఎవరినో తెచ్చి వీసీలుగా నియమించారు కదా అన్న ప్రశ్నపైనా అసహనంగా స్పందించారు.

Botsa Comments on EC Orders about AP DSC: రాష్ట్రంలో పింఛన్లను పంపిణీ చేయాల్సిన వాలంటీర్లను దానినుంచి దూరంగా ఉంచితే ఎవరు వాటిని సక్రమంగా వాటిని లబ్ధిదారులకు అందిస్తారని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఈవిషయంలో ఎన్నికల సంఘం ఉత్తర్వులను తాను తప్పుబట్టడం లేదన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ ప్రకటించామని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం హైకోర్టు ఉత్తర్వులతో నిలిపివేసిందన్నారు. వీటిని అడ్డుకుంటున్నవారు పేదలకు ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో లేదని దీనిపై తమ వైఖరి స్పష్టంగా చెబుతూనే ఉన్నామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.