గ్రౌండ్​ లెవెల్​లో బీజేపీ పట్టు కోల్పోయింది : మంత్రి కొండా సురేఖ - Lok Sabha Election 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 6:58 PM IST

thumbnail

Konda Surekha Meeting at Gajwel : లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల్లో భ్రమను సృష్టిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. గ్రౌండ్​ లెవెల్​లో కమలం పార్టీ పట్టు కోల్పోయిందని ఎద్దేవా చేశారు. గజ్వేల్​ నియోజకవర్గంలో కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరారు. 

Konda Surekha Comments on BRS : గజ్వేల్​ నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కార్యకర్తలతో కలిసి భారీ బైక్​ ర్యాలీని నిర్వహించారు. లోక్​సభ ఎన్నికల సందర్భంగా స్థానిక కాంగ్రెస్​ అభ్యర్థి నీలం మధును గెలిపించేలా పోరాడాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. కార్యకర్తలు లేకుంటే నాయకులు లేరని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఓటమికి కారణం సోషల్​ మీడియా కారణమని తెలిపారు. అందులో ఆ పార్టీ నాయకులు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు చూసే తగిన నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్​ హామీ ఇచ్చిన పథకాలన్ని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.