ఎమ్మెల్యే సంజయ్​కుమార్​కు కేసీఆర్​ పరామర్శ - KCR condoled death of MLA father

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 3:33 PM IST

thumbnail

KCR Condoled Death of MLA Sanjay Kumar Father : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ  మంత్రులు హరీశ్​రావు, ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ తండ్రి సీనియర్‌ న్యాయవాది మాకునూరి హన్మంతారావు ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయనను కలుసుకున్నారు.  

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి హన్మంతరావు 13 వ రోజు కార్యక్రమం జగిత్యాల వీరుపాక్షిగార్డెన్​లో జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాలకు వచ్చిన కేసీఆర్​ హన్మంతరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హన్మంతరావు చిత్రపటం ముందు పూలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్​ జగిత్యాలకు వచ్చారన్న వార్తను తెలుసుకున్న ఆయన అభిమానులు, బీఆర్​ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జగిత్యాలకు చేరుకున్నారు. వారితో బీఆర్ఎస్ అధినేత కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. ఆయన వెంట మాజీ మంత్రులు హారీశ్ రావు, ప్రశాంత్​ రెడ్డిలు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.