బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలకు ధన బలం ఉంటే, మాకు ప్రజా బలం ఉంది : కాసాని జ్ఞానేశ్వర్ - Lok Sabha Elections 2024

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 3:08 PM IST

thumbnail

Kasani Gnaneshwar Interview : పదేళ్ల పాటు కేసీఆర్​ చేసిన అభివృద్ధి, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా తాను చేసిన పనులు చూసి ఓటు వేయాలని చేవెళ్ల బీఆర్​ఎస్​ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కోరారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ధనికులైతే, తనకు ప్రజలపై ప్రేమ ఉందని అన్నారు. బీఆర్ఎస్​ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆ పార్టీ విఫలమైందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను ప్రజలు తిరిగి కోరుకుంటున్నారన్నారు. కరెంటు, నీళ్లు, రైతు బీమా, రైతు బంధు హామీలను కాంగ్రెస్ మరిచిందని మండిపడ్డారు. ఈ కారణాల వల్ల ప్రజలకు బీఆర్ఎస్​పై సానుకూల దృక్పథం ఉందని వివరించారు. దీంతో వీలైనంత వరకు పబ్లిక్​ మీటింగ్స్ పెట్టేందుకు​ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెండు అధికార పార్టీలను ఎదుర్కోవడం చాలా సునాయసం అని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.