పరిహారమివ్వని ఎన్​హెచ్ఏఐ - ఫర్నిచర్ స్వాధీనానికి కోర్టు అనుమతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 10:17 PM IST

thumbnail

Farmers tried to NHAI furniture  Possession: ఎన్​హెచ్ఏఐ పీడీ కార్యాలయంలోని ఫర్నిచర్​ను స్వాధీనం చేసుకునేందుకు విజయవాడ సివిల్ కోర్టు రైతులకు అనుమతినిచ్చింది. గన్నవరం మండలం బీబీ గూడెంకు చెందిన రైతులు చినఅవుటుపల్లి నుంచి చినకాకాని రహదారికి భూములిచ్చారు. మొదట ఎకరాకు 38 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు 22.5 లక్షలు మాత్రమే ఇచ్చారని రైతులు తెలిపారు. తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాలని రైతులు ఆర్బిట్రేషన్ కు వెళ్లారు. విచారణ జరిపిన ఆర్బిట్రేషన్ రైతులకు గతంలో ఇచ్చిన పరిహారం పై అదనంగా 30 శాతం చెల్లించాలని తీర్పునిచ్చింది. 

ఆర్బిట్రేషన్ తీర్పును ఎన్​హెచ్ఏఐ అమలు చేయకపోవటంతో రైతులు విజయవాడ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై సివిల్ కోర్టు విచారణ జరిపింది. మొత్తం 25 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. ఎకరాకు సుమారు 8 నుంచి 9 లక్షల రూపాయల పరిహారం రావాలని తెలిపారు. మొత్తం 25 ఎకరాలకు 2 కోట్ల రూపాయల పైనే చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్​హెచ్ఏఐ పీడీ కార్యాలయంలోని ఫర్నీచర్​ను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో రైతులు గురునానక్ కాలనీలోని కార్యాలయానికి చేరుకున్నారు. స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన కోర్టు సిబ్బందికి ఎన్​హెచ్​ఏఐ సిబ్బంది సహకరించ లేదని రైతులు చెబుతున్నారు. ఉదయం నుంచి కార్యాలయం వద్ద వేచి ఉన్నా, స్పందించటం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్​హెచ్ఏఐ సహకారం లేకపోవటంతో రైతులు వెనుదిరిగారు. ఈ విషయాన్ని కోర్టుకు విన్నవించి పోలీసు ప్రొటెక్షన్ తీసుకుంటామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.