యాదాద్రికి రెండంతస్థుల భవనాన్ని కానుకగా ఇచ్చిన దంపతులు - విలువ తెలిస్తే షాక్!

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 11:54 AM IST

thumbnail

Devotee Who Gave Property Of 3 Crores to Yadadri Temple : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి హైదరాబాద్ చైతన్యపురిలోని 260 చదరపు గజాల్లో ఉన్న రెండు అంతస్థుల భవనం కానుకగా చేకూరింది. ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం భాగ్యనగరంలోని చైతన్యపురికి చెందిన టి.శారద - హనుమంతరావు దంపతులు తమ స్థిరాస్తి సుమారు రూ.3 కోట్ల విలువైన భవనాన్ని యాదాద్రీశుడికి అప్పగిస్తూ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆలయ ఈవోతో పాటు డిప్యూటీ భాస్కర శర్మ, ఏఈవో శ్రవణ్ కుమార్​కు దాత దంపతులు స్థలంతో పాటు ఇంటిని అప్పగించారు.

Telangana Govt on Yadadri Temple : ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటూ పలువురు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. ఇటీవల కొందరు పెద్ద ఎత్తున బంగారం, వెండి స్వామివారికి సమర్పించగా, తాజాగా ఈ దంపతులు ఏకంగా రూ.3 కోట్ల విలువైన తమ భవనాన్ని రాసిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.