'హైదరాబాద్​లో ఆస్తులు కొంటే భద్రత'కు భరోసా ఇస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 10:13 PM IST

thumbnail

Credai Property Show in Hyderabad : ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో నిర్మాణరంగం పాత్ర ముఖ్యమైందని, వారికి సహకరించేందుకు తాము అన్ని వేళలా అందుబాటులో ఉంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్​లో ఆస్తులు కొంటే భద్రత ఉంటుందనే భావనను తమ ప్రభుత్వం కలుగజేస్తుందన్నారు. హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రెడాయ్​ ప్రాపర్టీ షో ముగింపు వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పాల్గొన్నారు. 

నిర్మాణరంగం వాళ్లకు సహకరించేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మరోవైపు తమది కన్​స్ట్రక్షన్​ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, నగరాన్ని గ్లోబల్​ సిటీగా మార్చేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. నగరంలో ట్రాఫిక్​ సమస్య తీవ్రంగా ఉందని, అందుకోసం మెట్రో ట్రాన్స్​ఫోర్టును అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. ఒకే వేదికపై 100కు పైగా రెరా రిజిస్ట్రేషన్​ కలిగిన సంస్థలు తమ ప్రాజెక్టుల వివరాలను ఇక్కడ ప్రదర్శించాయి. డెవలపర్లు, మెటీరియల్స్​, ఇంటీరియల్స్​, ఫైనాన్స్​ సంస్థలు తమ స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.