బస్సును ఢీకొని కారు దగ్ధం - అంతా క్షణాల్లోనే!

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 7:05 PM IST

thumbnail

Car Fire Accident in Bhadradri Kothagudem : ఒకే రహదారిలో ప్రయాణిస్తున్న బస్సు, కారు ప్రమాదానికి గురైయ్యాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు- మహబూబాబాద్ ప్రధాన రహదారిపై నిజాంపేట సమీపంలో ఇల్లందు వస్తున్న ఆర్టీసీ మినీ బస్సును అదే మార్గంలో వస్తున్న కారు వెనుక నుంచి ఢీ కొట్టింది(Car Accident). దీంతో కారు డ్రైవర్​ రాంబాబు ఆర్టీసీ బస్సు డ్రైవర్​తో వాగ్వాదం చేసేందుకు కిందకి దిగాడు. 

Car accident at Nizampet : కారు, బస్సు డ్రైవర్లు ఇద్దరు వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే కారు నుంచి పొగలు రావడం గమనించారు. వారు చూస్తుండగానే కారు పెద్ద పెద్ద మంటలు చెలరేగి దగ్ధమయింది. ఈ ఘటన అంతా క్షణాల్లో జరిగిపోయింది. దీంతో షాక్​లోకి వెళ్లిన రాంబాబు కాసేపటికి తేరుకుని ప్రాణాలు మిగిలాయని తనకు తాను సర్థి చెప్పుకున్నాడు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.