పంటలకు సాగునీరందించాలని బీఆర్ఎస్ నాయకుల ధర్నా- గంటసేపు నిలిచిపోయిన వాహనాలు - BRS Leaders Dharna In Karimnagar
Published : Mar 31, 2024, 1:51 PM IST
BRS Leaders Dharna In Gangadhara Mandal : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువలోకి నీటిని విడుదల చేయాలని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వంతెనపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. యాసంగి పంటలకు సాగునీరు లేక పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులకు వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
BRS Leaders Fires On Govt : కాంగ్రెస్ హయాంలో రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సాగునీరందక ఎండిపోయిన పంటలకు తక్షణమే పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలని కోరారు. నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సుమారు గంటసేపు ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన కారులను అదుపులోనికి తీసుకున్నారు.